December 15, 2012

పాదయాత్రలో చంద్రబాబు మెనూ ఇదే..

వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరీంనగర్ జిల్లాలో శనివా రం పాదయాత్రను చేపట్టారు. కాళ్ల నొ ప్పులు, నడుము నొప్పులతో బాధపడుతున్న చంద్రబాబు శరీరంలో షుగర్ లెవల్స్‌లో హెచ్చుతగ్గులు ఉంటుండడంతో వైద్యుల సూచన మేరకు ఆయన ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తీసుకుంటున్న భోజన వివరాలివి.. ఉద యం పూట రాగిజావతో పాటు ఓట్స్ తీసుకుంటున్నారు. మధ్యాహ్నం రెం డు కప్పుల కర్రీలతో మూడు లేదా నాలుగు పుల్కాలు తింటారు. రాత్రిపూట గోధుమపిండితో చేసిన పొంగలి కానీ, ఉప్మా రవ్వతో చేసిన పొంగిలిని తీ సుకుంటున్నారు. మధ్య మధ్యలో కీరా జ్యూస్, కాఫీ తీసుకుంటున్నారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో 12 నుంచి 18కిలోమీటర్ల వరకు, ఆదివారం 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తున్నారు.

దినచర్య : చంద్రబాబు నాయుడు తాను బస చేసిన ప్రాంతంలో ఉదయం 5 గంటలకే లేచి కాలకృత్యాలు తీర్చుకొ ని, స్నానం చేసి పార్టీ నేతలతో సంభాషిస్తారు. అనంతరం దినపత్రికలను చది వి కాసేపు టీవీ ఛానళ్లలో వచ్చే వార్తల ను చూస్తున్నారు. గంటసేపు రాష్ట్రంలో ని పార్టీ ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలీకాన్ఫరెన్స్ ని ర్వహిస్తున్నారు. పాదయాత్ర చేపట్టే జి ల్లాల్లోని ఒకటి లేదా రెండు నియోజకవర్గాల నాయకులతో ప్రత్యేక సమావే శం నిర్వహించి ఆ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని, ఇతర పార్టీల పరిస్థితి, సమస్యల గురించి చర్చించి వారికి తీసుకోబోయే చర్యల గురించి వివరిస్తారు. ఆ తదనంతరం పాదయాత్రను ప్రారంభిస్తారు.