December 15, 2012

బాబుకు వినతుల వెల్లువ

మెట్‌పల్లి/మల్లాపూర్/ఇబ్రహీంపట్నం: 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా శనివారం మల్లాపూర్ మండలం లో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి నా రా చంద్రబాబు నాయుడుకు ప్రజలు తమ సమస్యలపై అనేక రకాల వినతిపత్రాలు అందించారు. గీత కార్మికులు తమ సమస్యలు పరిష్కరిచాలంటూ వినతిపత్రాలు అందించారు. గీత కార్మిక సొసైటీలకు ప్ర భుత్వం స్థలం కేటాయించాలని, చెట్ల పెం పకానికి స్థలం ఇవ్వాలని, కార్మికులకు పింఛన్లు అందించాలని కోరుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన గీత కార్మికులు చంద్రబాబును కలిసి వినతిప త్రం అందించారు. చెరుకుకు మద్దతు ధ రను రూ. 3 వేలు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలని కోరుతూ పలు రైతు సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు బాబుకు వినతిపత్రం అందించారు.

కేంద్ర హోం శాఖ పిలుపు మేరకు జ రగనున్న అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కోరుతూ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీ ఏలేటి ముత్తయ్యరెడ్డి, నాయకులు వర్థినేని సత్యనారాయణరావు, బాజోజి భాస్కర్, ఇందూరి సత్యం, వాకిటి ఆనంద్‌రెడ్డి, సదబత్తుల వేణు తదితరులు వినతిపత్రం అందించారు.ఎస్సారెస్పీ పునరావాస గ్రామాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగెం శ్రీరాంపూర్ వాసులు చంద్రబాబును కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. సమస్యలను వివరించుకున్న ప్రజలకు పరిష్కరానికి చంద్రబాబు భరోసా ఇస్తూ తగిన హామీనిచ్చారు.