December 15, 2012
ఇటు తండ్రులు..అటు తనయులు
నిర్మల్/ఖానాపూర్: తండ్రులు చేస్తున్న
పాదయాత్రకు తనయులు బాసటగా నిలిచి పాదయాత్రలో పాల్గొనడంతో చంద్రబాబు
పాదయాత్రకు మరింత వన్నె తెచ్చింది. వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో
చంద్రబాబుతో పాటు ఎంపీ రాథోడ్ రమేష్ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. కాగా
శుక్రవారం చంద్రబాబు తనయుడు లోకేష్, ఎంపీ రాథోడ్ రమేష్ తనయుడు రితీష్లు
పాదయాత్రలో పా ల్గొని ఆకర్షణగా నిలిచారు. గురువారం రాత్రి ఖానాపూర్
మండలంలోని ఎక్బాల్పూర్ వద్ద బస చేసిన చంద్రబాబును ఆయన తనయుడు లోకేష్
శుక్రవారం ఉదయమే వచ్చి కలిశారు. తండ్రి చేస్తున్న పాదయాత్ర, యోగ క్షేమాలను
అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన తండ్రి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం కాగా
తనయుడు లోకేష్ తండ్రి వెన్నంటే ఉండి పాదయాత్రను కొనసాగించాడు. టీడీపీ
రాష్ట్ర యువ నేత లోకేష్ రావడంతో జిల్లా తెలుగు యువత మరింత ఉత్సాహంతో
పాల్గొనడానికి తరలివచ్చారు.
దీంట్లో ఎంపీ రాథోడ్ రమేష్ తనయుడు రితీష్ నేతృత్వం వహిస్తూ యువతను పాదయాత్రలో కదిలించాడు. వీరిద్దరితో పాటు మరికొంత మంది యువకులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ం లోకేష్కు ఘనస్వాగతం... ఖానాపూర్ మండల కేంద్రంలో చంద్రబాబు నాయుడు బస చేసిన స్థలానికి ఉదయం 8.40కి లోకేష్ చేరుకున్నారు. అనంతరం మండల కేంద్రం నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, యువకులు ఆయనను కలిసేందుకు పోటీ పడ్డారు. లోకేష్బాబు తన తండ్రితో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. యువకులు లోకేష్బాబు రాజకీయాల్లోకి రావాలని నినాదాలు చే శారు. ఎక్బాల్పూర్లో జరిగిన ఇష్టగోష్టి సభలో చంద్రబాబునాయుడు, మిగతా నాయకులు స్టేజిపై కూర్చోని మాట్లాడగా లోకేష్బాబు మాత్రం పక్కనే నిలబడి ఆసక్తిగా విన్నారు.
Posted by
arjun
at
2:41 AM