December 15, 2012

చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు.

నిర్మల్/ఖానాపూర్/కడెం/మామడ/సారంగాపూర్/నిర్మల్అర్బన్: ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది రోజుల పా టు కొనసాగిన చంద్రబాబు పాదయా త్ర శుక్రవారం ఖానాపూర్ నియోజక వ ర్గంలోని బాదనకుర్తి వద్ద ముగిసింది. మన జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబు కు ఘనమైన వీడ్కోలును పలకగా శుక్రవారం రాత్రి కరీంనగర్ జిల్లాలో యా త్ర ప్రారంభమైన దృష్ట్యా అక్కడి నా యకులు సైతం చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. బాసర నుంచి బా దనకుర్తి వరకు అన్నిచోట్ల చంద్రబాబు కు ప్రజలు ఘన నీరాజనం పలికారు. ఆదిలాబాద్ జిల్లా ఎంపీ రాథోడ్ రమే ష్, పార్టీ అధ్యక్షులు నగేష్, ప్రధాన కా ర్యదర్శి లోలం శ్యామ్‌సుందర్, ముథో ల్ నియోజక వర్గ ఇన్‌చార్జి నారాయణరెడ్డి, నిర్మల్ నియోజక వర్గ ఇన్‌చార్జి బా బర్, ఆదిలాబాద్ నియోజక వర్గ ఇన్‌చార్జి పాయల శంకర్ తదితరులు బా సర నుంచి బాబు వెన్నంటే ఉండి బాదనకుర్తి వరకు పాదయాత్రను జయప్ర దం చేసి శుక్రవారం రాత్రి వీడ్కోలు ప లికారు.

కాగా భాజా భజంత్రీల మధ్య, టపాసుల మోతలో జై తెలుగుదేశం అంటూ స్వాగత నినాదాలతో కరీంనగర్ జిల్లా సరిహద్దులో కరీంనగర్ ఎ మ్మెల్యే గంగుల కమలాకర్, జగిత్యాల ఎమ్మెల్యే ఎల్.రమణల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు తరలివచ్చి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.వస్తున్నా మీకోసం పాదయాత్రను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు తాము కృషి చేస్తామన్న దృఢ సంకల్పంతో టీడీపీ అధినేత చంద్రబా బు నాయుడికి ఎదురేగి స్వాగతం పలికారు. ఆదిలాబాద్ జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర విజయవంతమైనందుకు జిల్లా నేతలు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సదర్‌మాట్‌పై మినీ బ్యారేజీ నిర్మిస్తాం.. ఖానాపూర్ మండలంలోని సదర్‌మాట్‌పై మినీ బ్యారేజి నిర్మించేందుకు కృషి చేస్తానని, ఇది చాలా చిన్న పని అని, బార్యేజి మంజూరైన పని చేయించలేకపోతున్నారని టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు అన్నారు. ఖా నాపూర్ మండలం బాదనకుర్తి గ్రామం లో జరిగిన కార్యక్రమంలో రాత్రి 10 గంటలకు జరిగిన కార్యక్రమంలో మా ట్లాడారు. బ్యారేజి నిర్మించడం వలన రైతుల కష్టాలు గట్టెక్కుతాయిని, రెండు మండలాల రైతులకు మేలు చేకూరుతుందని అన్నారు.

కాంగ్రెస్ హయం లో చేయలేని పని బాదనకుర్తి వద్ద వం తెన నిర్మింపచేయించిన ఘనత టీడీపీదేనన్నారు. ఎంపీ రాథోడ్ రమేష్ బాదనకుర్తి బాధల గురించి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పడం జరిగిందని, బాదనకుర్తి గ్రామం గోదావరి న ది రెండు పాయల మధ్య ఉండడంతో బాహ్యప్రపంచానికి దూరంగా ఉన్నార ని, వంతెన కావడం వల్ల ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు దగ్గరవ్వడమే కా కుండా రవాణ సౌకర్యం పెరిగి అభివృ ద్ధి త్వరితగతిన జరిగిందని చెప్పారు. గ్రామస్థుల కోరిక మేరకు పదవ తరగ తి అప్‌గ్రేడ్ అయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్ర లో తాను చేసిన పనులను గుర్తుపెట్టుకొని మహిళలు స్వాగతించడం జీవితంలో మర్చిపోనని గుర్తు పెట్టుకుంటానని చెప్పా రు. గ్రామాలకు రహదారి ఏర్పడితే నా గరికత పెరుగుతుందని, ప్రజల్లో చైత న్యం వస్తుందని అన్నారు. కార్యక్రమం లో ఎంపీ రాథోడ్ రమేష్, బాదనకుర్తి మాజీ ఎంపీటీసీ గుడాల రాజన్న, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షలు ఇస్తా.. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా ఖానాపూర్ పట్టణంలో నిర్వహించే పాదయాత్రకు వస్తున్న జాదవ్ విలాస్ నాయక్ మృతిచెందిన బాధిత కుటుంబానికి రూ. 2 లక్షలు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ సందర్భంగా బాదనకుర్తి లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ తన పాదయాత్ర కు వస్తూ ప్రైవేట్ బస్సు ఢీకొని మృతిచెందిన మృతుడికి కుటుంబానికి ప్ర గాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాథోడ్‌ను అభినందించిన లోకేష్ ఖానాపూర్ మండలంలో శుక్రవా రం జరిగిన వస్తున్నా... మీకోసం పాదయాత్రలో చంద్రబాబునాయుడు శుక్రవారం రోజు దిగ్విజయంగా కొనసాగడంతో బాబు తనయుడు లోకేష్ ఎంపీ రాథోడ్ రమేష్‌ను అభినందించారు. మండలంలో, జిల్లాలో పాదయాత్ర ఎ లాంటి ఆటంకాలు లేకుండా కొనసాగ డం అభినందనీయమన్నారు. చివరగా బాదనకుర్తి నుంచి కరీంనగర్ జిల్లా ఓ బుళపురంకు ప్రవేశించిన పాదయాత్ర రాత్రి 10.30 గంటలకు లోకేష్‌బాబు రాథోడ్ రమేష్‌ను కలిసి అభినందించి ఆనందం వ్యక్తం చేశారు.