December 15, 2012

బాబుకు ఘన స్వాగతం

మెట్‌పల్లి/మల్లాపూర్: ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల సరిహద్దులోని బాదనకుర్తి వంతెన వద్ద మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నా యుడు పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. వస్తున్నా...మీకోసం కా ర్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటనను ముగించుకొని గోదావరి నదిపై నిర్మించిన బాదనకుర్తి వంతెన మీదుగా శుక్రవారం రా త్రి 11 గంటలకు చంద్రబాబు నాయు డు కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల ని యోజకవర్గం మల్లాపూర్ మండలం ఒబులాపూర్ వద్దకు చేరుకున్నారు. జిల్లాకు చేరుకున్న చంద్రబాబుకు అ పూర్వ స్వాగతం లభించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇనుగాల పెద్దిరెడ్డి, ఎల్ రమణ, వెంకటేశ్వర్‌రావు, గండ్ర నళిని, ఎమ్మెల్సీ నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథంలతో పాటు పలువురు నాయకులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం ప లికారు.

వేద పండితులు అర్చకులు మంత్రోచ్ఛారణలు చేస్తూ పూర్ణకుంభ స్వాగతం పలికి జిల్లాలోకి ఆహ్వానించారు. డప్పువాయిద్యాలు, మంగళహారతులతో బాబును ఊరేగింపుగా ఎదుర్కొన్నారు. అక్కడి నుంచి సు మారు అరకిలో మీటరు దూరం గల ఒబులాపూర్ వరకు బాబు పాదయా త్ర జరిపారు. టీడీపీ నాయకులు, కా ర్యకర్తలు, అనుబంధ సంఘాల నా యకులు, కార్యకర్తలు జేజేలు పలుకుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. దారిపొడవునా పాటలు పాడుతూ...నృత్యాలు చేస్తూ పాదయాత్రలో కార్యకర్తలు హుషారుగా గడిపారు. చంద్రబాబు నాయుడు నాయకులు, కార్యకర్తలకు అభివాదాలు చేస్తూ పాదయా త్ర జరిపారు.

కార్యక్రమంలో ముద్దసాని కశ్యప్‌రెడ్డి, బుగ్గారం మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథం, టీడీపీ నాయకులు, టీడీపీ వేములవాడ ని యోజకవర్గ నాయకురాలు గండ్ర నళి ని, రమేశ్, రవీందర్ రావు, సాంబారి ప్రభాకర్, రఫీ, ఆర్మూర్ కిష్ట య్య, సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.

ఒబులాపూర్‌లో రాత్రి బస....మల్లాపూర్ మండలంలోని ఒబులాపూర్‌లో టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు రాత్రి బసకు వచ్చారు. గ్రామ పంచాయతీ శివారులో గల మై దానంలో టీడీపీ నాయకులు బాబు బసకు ఏర్పాట్లు చేశారు.

మైదానంలో ఏర్పరిచిన ప్రత్యేక వాహనంలో చంద్రబాబు రాత్రి బస జరిపారు. మారుమూల మండలంలోని అటవీ ప్రాం తంలో గోదావరి సమీపాన చంద్రబా బు నాయకుడు రాత్రి బస చేయడం విశేషం. రాత్రి బసకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రవీందర్ ఆద్వర్యంలో జగిత్యాల ఏఎస్పీ రమారాజేశ్వరీ, సీఐ దేవందర్ రెడ్డిల పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు చేశారు