May 7, 2013

ఆస్ట్రేలియాలో టీడీపీ శాఖ! కువైట్‌లో పాదయాత్ర విజయోత్సవాలు



హైదరాబాద్/గల్ఫ్ ప్రతినిధి : ఆస్ట్రేలియాలో తెలుగుదేశం పార్టీ శాఖ ఏర్పాటైంది. సిడ్నీ నగరంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నూతన శాఖకు కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. అధ్యక్షునిగా కోడూరి శ్యాం ప్రసాద్, ఉపాధ్యక్షునిగా కొండబోలు నవీన్, కార్యదర్శిగా ముత్తవరపు హిమబిందు, సహాయ కార్యదర్శిగా చింతమనేని రవీంద్ర, కోశాధికారిగా చెన్నుపాటి విజయ్ ఎన్నికయ్యారు.జూన్ రెండో తేదీన ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు జరపనున్నట్టు చెప్పారు.



మరోవైపు, పాదయాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో కువైట్‌లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు, సభ్యులు వేడుకలు జరుపుకున్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ నేత ములకల సుబ్బారాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి ఆ పార్టీ ముఖ్య నేతలు రేవంత్ రెడ్డి, పయ్యావుల కేశవులు పాల్గొన్నారు.