May 7, 2013

తెలుగు జాతి మరిచిపోలేని మహావ్యక్తి ఎన్టీఆర్ : చంద్రబాబు

ఎన్టీఆర్ జీవితంపై 'ఫ్రమ్ ఫ్రేమ్స్ టు ఫేం' పుస్తకావిష్కరణ
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటింది ఎన్టీఆరే : బాలకృష్ణ

న్యూఢిల్లీమంగళవారం ఉదయం పార్లమెంట్‌లో విగ్రహావిష్కరణ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు తన చిరకాల కోరిక అన్నారు. పేద ప్రజలకు సేవ చేయాలని ఎన్టీఆర్ అహర్నిషలు శ్రమించారన్నారు. ఎన్టీఆర్‌తో రాజకీయంగా, కుటుంబపరంగా ఎన్నో అనుభూతులను పొందానని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని, పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ తనయుడు, సినీహీరో, టీడీపీ నేత బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగుజాతి మర్చిపోలేని మహావ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. పార్లమెంటులో ఆయన విగ్రహం ఏర్పాటు తెలుగు జాతికే గర్వకారణమని చెప్పారు. దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది మహోన్నత చరిత్ర అన్నారు. ప్రాంతీయ పార్టీలను జాతీయస్థాయిలో ఏకం చేసిన గొప్ప నేత అని, పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు టిడిపి ఎంతో కృషి చేసిందన్నారు. ఎన్టీఆర్ ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు, వాటినే దేశ వ్యాప్తంగా అమలుచేశారని ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తుచేశారు.

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ జీవిత విశేషాలపై 'ఫ్రమ్ ఫ్రేమ్స్ టు ఫేం' పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి దంపతులు, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు, బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై రాసిన 'యుగపురుషుడు' పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అవినీతి మకిలి అంటని నేత ఎన్టీఆర్ మాత్రమే అన్నారు.

: తెలుగు జాతి మరిచిపోలేని మహావ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభివ ర్ణించారు. ఎన్టీఆర్ దగ్గర పనిచేయడం తన అదృష్టం అని ఆయన తెలిపారు. ప్రజాసేవ ఎలా చేయాలో ఎన్టీఆర్ దగ్గరే నేర్చుకున్నానని బాబు చెప్పారు. ఎన్టీఆర్ స్పూర్తి, సిద్దాంతాలను ముందుకు తీసుకువెళ్తామన్నారు పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.