May 7, 2013

ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి : చంద్రబాబు

న్యూఢిల్లీ

సంక్షేమం, అభివృద్ధికి నాంది పలికిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని ఆయన విగ్రహాన్ని పార్లమెంట్ లో ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. విగ్రహావిష్కరణ అంశాన్ని రాజకీయం చేయటం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగే అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కూడా పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు.
: జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌దని, ఆయనకు 'భారతరత్న' ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం పార్లమెంట్‌లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు తన చిరకాల వాంఛ, టీడీపీ ఆకాంక్ష అని చంద్రబాబునాయుడు తెలిపారు.