May 7, 2013

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటింది ఎన్టీఆరే : బాలకృష్ణ

న్యూఢిల్లీ
: తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాలింది ఎన్టీఆరే అని ప్రముఖ నటుడు బాలకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలుగు జాతికే గర్వకారణమన్నారు. ఎన్టీఆర్ ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు, వాటినే దేశ వ్యాప్తంగా అమలుచేశారని బాలకృష్ణ గుర్తుచేశారు.