April 23, 2013
బాబు పాదయాత్రతో కాంగ్రెస్కు దడ
దత్తిరాజేరు:టీడీపీ
అధ్యక్షుడు చం ద్రబాబునాయుడు చేసిన పాదయాత్ర కాంగ్రెస్కు ముచ్చమటలు
పట్టాయని టీడీపీ నాయకురాలు, మాజీమంత్రి పడాల అరుణ అన్నారు. సోమవారం
దత్తిరాజేరులో పర్యటించిన ఆమె విలేఖరులతో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ ఒక్కరూ
చేయని విధంగా చంద్రబాబు పాదయాత్ర చేసి ప్రజలకు చేరువ కావడంతో కాంగ్రెస్
పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.
ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష మద్దతు రావడంతో కాంగ్రెస్ జీర్ణించుకోలేక అమ్మహస్తం, ఇందిరమ్మ కలలు వంటి పథకాలు పెట్టి అభాసుపాలవుతున్నారన్నారు. ఈ నెల 27న చంద్రబాబు నాయుడు పాదయాత్ర విశాఖతో ముగుస్తుండడంతో భారీ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈసభను విజయవంతం చేయడానికి గజపతినగరం నియోజకవర్గం నుంచి పది వేలు మంది కార్యకర్తలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. మండలాల ప్రజ లు పెద్దఎత్తున తరలిరావాలని ఆమె కోరారు. సమావేశంలో మండల పార్టీ అద్యక్షుడు బెజవాడ రామునాయుడు, నాయకులు ఎన్.రామునాయుడు, గాడి కృష్ణ, మురపాక బాస్కరరావు, బి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
1:28 AM