February 1, 2013

సహకార పోరులో ఏకగ్రీవాలతో టీడీపీ ఆధిక్యం

(మచిలీపట్నం) జిల్లాలో తొలిదశ సహకార ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మచిలీపట్నం, విజయవాడ డివిజన్లలోని 89 సొసైటీలకు గురువారం ఎన్నికలు జరిగాయి. 95.25 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. డ్రా సందర్భంగా స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో మొత్తం 424 సొసైటీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 18 సొసైటీలలో స్టే ఉత్తర్వులతో ఎన్నికలు ఆగిపోయాయి. మొత్తంగా 226 సొసైటీలు ఏకగ్రీవం కాగా 180 సొసైటీలు ఎన్నికల బరిలో నిలిచాయి. వీటిలో 89 సొసైటీలకు గురువారం ఎన్నికలు జరగ్గా, మిగిలిన గుడివాడ, నూజివీ డు డివిజన్‌లోని 91 సొసైటీలకు రెండో విడతలో ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి. స్వల్ప సంఘటనలు మినహా గురువారం తొలిదశ ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నా రు. డ్రా సందర్భంగా ఇబ్రహీంపట్నం కొటికలపూడి, బందరు మండలం చిలకలపూడిలో స్వల్ప వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి.

ఏకగ్రీవాలతో టీడీపీ ఆధిక్యం తొలిదశ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలుపుకుని టీడీపీ బలపర్చిన అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు. 105 సం ఘాలు ఏకగ్రీవం కాగా, వీటిలో 39 సంఘాలను కైవసం చేసుకున్న టీడీపీ మద్దతుదార్లు గురువారం జరిగిన ఎన్నికల్లో 29 చోట్ల విజయం సాధించారు. వీరి సంఖ్య మొత్తంగా 68కి చేరింది. కాంగ్రెస్ మద్దతుదార్లు ఎన్నికల్లో 35 చోట్ల గెలుపొందగా, ఏకగ్రీవాలలో 24 సొసైటీలు పొంది 59 స్థానాలకు చేరారు. వైఎస్సార్ సీపీ ఏకగ్రీవాలలో 27, ఎన్నికలలో 22 సొసైటీలను పొందగలిగింది.

వామపక్షాలు మూడు సొసైటీలను కైవసం చేసుకోగా, ఇతరులు 15 చోట్ల ఉన్నారు.నేడు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక తొలిదశలో గెలుపొందిన అభ్యర్థులలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. సొసైటీ ఎన్నికల అధికారి సమక్షంలో ఈ ఎన్నికలు జరుగుతాయని డీసీవో రమేష్‌బాబు తెలిపారు. సొసైటీ మినిట్స్ బుక్‌లో కార్యవర్గాన్ని నమోదు చేసి ధ్రువీకరించడం జరుగుతుందన్నారు.