February 1, 2013
సహకార పోరులో ఏకగ్రీవాలతో టీడీపీ ఆధిక్యం
ఏకగ్రీవాలతో టీడీపీ ఆధిక్యం తొలిదశ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలుపుకుని టీడీపీ బలపర్చిన అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు. 105 సం ఘాలు ఏకగ్రీవం కాగా, వీటిలో 39 సంఘాలను కైవసం చేసుకున్న టీడీపీ మద్దతుదార్లు గురువారం జరిగిన ఎన్నికల్లో 29 చోట్ల విజయం సాధించారు. వీరి సంఖ్య మొత్తంగా 68కి చేరింది. కాంగ్రెస్ మద్దతుదార్లు ఎన్నికల్లో 35 చోట్ల గెలుపొందగా, ఏకగ్రీవాలలో 24 సొసైటీలు పొంది 59 స్థానాలకు చేరారు. వైఎస్సార్ సీపీ ఏకగ్రీవాలలో 27, ఎన్నికలలో 22 సొసైటీలను పొందగలిగింది.
వామపక్షాలు మూడు సొసైటీలను కైవసం చేసుకోగా, ఇతరులు 15 చోట్ల ఉన్నారు.నేడు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక తొలిదశలో గెలుపొందిన అభ్యర్థులలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. సొసైటీ ఎన్నికల అధికారి సమక్షంలో ఈ ఎన్నికలు జరుగుతాయని డీసీవో రమేష్బాబు తెలిపారు. సొసైటీ మినిట్స్ బుక్లో కార్యవర్గాన్ని నమోదు చేసి ధ్రువీకరించడం జరుగుతుందన్నారు.
Posted by
arjun
at
7:23 AM