రాష్ట్రంలో పరిపాలన
అస్తవ్యస్తంగా తయారైంది. పేదలు, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. చంద్రబాబు
వస్తేనే పాలన గాడిలో పడుతుందని అభిప్రాయపడ్డారు. పరిటాల శిబిరం వద్దకు
గురువారం వచ్చిన వడ్డే, అధినేత చంద్రబాబును కల్సి పరామర్శించారు. అనంతరం
విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హాయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి
చెందిందన్నారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన వంటి కార్యక్రమాల
వల్ల అన్ని వర్గాలవారికి ఎంతో మేలు జరిగిందన్నారు. ప్రజల సమస్యలను
తెలుసుకోవటంతో పాటుగా టీడీపీ హాయాంలో జరిగిన అభివృద్ధి గురించి పాదయాత్రలో
వివరించాలని, కరపత్రాల రూపంలో ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబుకు
సూచించనట్టు వడ్డే చెప్పారు.