'నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు
చేపట్టిన నెలల వ్యవధిలోనే విజయవాడ నగరాన్ని దేశంలోనే ఇన్ఫర్ర్మేషన్
టెక్నాలజీ(ఐటీ) హబ్గా మారుస్తా' నని తెలుగుదేశం పార్టీ అధినేత నారా
చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ
పాలిటెక్నిక్ కళాశాలలో సాఫ్ట్వేర్ టె క్నాలజీ పార్క్ఆఫ్ ఇండియా ఏర్పాటు
చేశానని, ఇక్కడ ఏర్పాటు చేసిన ఐటీ పార్క్ కూడా విద్యార్ధులకు సరైన
సేవలందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర పునః ప్రారంభం అయిన
వెంటనే గురువారం పరకాలలోని ఎంవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ఓ
పెట్రోల్బంకులో ముఖాముఖి నిర్వహించారు. ముందు గా విద్యార్థులు అడిగిన పలు
ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అధికారం లో ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ను
నాలెజ్జ్ రాష్ట్రంగా తయారు చేశానన్నారు. ఐఐటీ, ఐఐఎం, సివిల్స్ వంటి పోటీ
పరీక్షల్లో మన రాష్ట్రం నుంచి ప్రతి ఏటా 30 శాతం మంది ఎంపికయ్యేవారని,
ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ రాషా
్ట్రన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిందన్నారు. రాష్ట్రంలో అవినీతి, అసమర్థ
పాలన నడుస్తోందని దీనికి యువతే చమర గీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం
పూర్తిగా బాగుపడే వరకూ తాను అవిశ్రాంతంగా కృషి చేస్తానని ఆయన వాగ్దానం
చేశారు. నిరుద్యోగులకు భృతి కల్పిస్తానన్నారు. ఫీజురీయింబర్స్మెంట్,
ఉపకారవేతనాలను సక్రమంగా విద్యార్థులందరికీ అందేలా చూస్తానని ఆయన
హామీనిచ్చారు. యువత రాష్ట్రంలోని అవినీతిపరుల గుండెల్లో రైళ్ళు
పరుగెత్తించాలని ఆయన పిలుపునిచ్చారు.