February 5, 2013
రైతులు,పేదలే చంద్రబాబుకు ఊపిరి
గుంటూరు: రైతులు, పేదప్రజలే తన ఊపిరిగా
చంద్రబాబు కొనసాగిస్తో న్న 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రకు ప్రజల నుండి
అపూర్వస్పందన లభిస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు
అన్నారు. సోమవారం ఎన్టీఆర్ భవన్లో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ
చరిత్రలోనే పాదయాత్ర ద్వారా ఇంతమంది పేద ప్రజలను కలిసిన మరే నాయకుడు
లేడన్నారు. కాంగ్రెస్, వైసిపిలు ప్రజలను కష్టాల్లోకి
నెట్టాయన్నారు.కాంగ్రెస్ ప్రభు త్వం అంతర్గత కుమ్ములాటలతో ర్రాష్టా న్ని
సర్వనాశనం చేస్తోందన్నారు. పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించి తొమ్మి
దేళ్ల వుతున్నా ఇంతవరకూ పూర్తయ్యే పరిస్థితి కనపడలేదన్నారు. జిల్లాలో
మంత్రులు అలంకారప్రాయంగా ఉండి ప్రజల ప్రయోజనాలను కాలరాస్తున్నారని
విమర్శించారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో
శాంతిభద్రతలు, నిత్యావసర వస్తువుల అధిక ధరలతో మహిళలు ఇబ్బందులు
పడుతున్నారన్నారు.
మహిళలందరూ చంద్రబాబు పాదయాత్రలో పాల్గొని ఘ నస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేశం నాయకులు మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహనరావు, ఎమ్మె ల్యేలు యరపతినేని శ్రీనివాసరా వు, కొమ్మాలపాటి శ్రీధర్, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్, టీడీపీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, తెనాలి శ్రావణ్కుమార్, యాగంటి దుర్గారావు, చిట్టాబత్తిన చిట్టిబాబు పాల్గొన్నారు.
Posted by
arjun
at
5:31 AM