February 5, 2013
బాబు రూట్ మ్యాప్పై కంభంపాటి కసరత్తు
తాడేపల్లి: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ
నేతలు కంభంపాటి రామమో హనరావు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, పరిశీలకుడు
రవి యాదవ్ సోమవారం తాడేపల్లి పట్టణంలోని సీతానగరం విచ్చేసి చంద్రబాబు
బసచేయనున్న ప్రాం తాన్ని పరిశీలించారు. చంద్రబాబు మంగళవారం తేదీ రాత్రి
సీతానగ రంలో బసచేసే దుర్గగుడి కాటే జీని ఆయన పరిశీలించారు. సీతాన గరంలో
చంద్రబాబు తన వాహనంలోనే వెంకటే శ్వరస్వామి ఆలయ సమీపంలో వున్న స్థలంలో
బసచేస్తే ఇతర వాహనాలు సీతానగరం బోటుయార్డు సమీపంలో వున్న ఖాళీస్థలంలో
నిలిపితే ఎలావుం టుందన్న అంశాలను నేతలు పరిశీలించా రు. ఇక చంద్రబాబు
భోజనానికి తాడేపల్లి సాయిబాబా మందిర సమీపంలోని ఖాళీ స్థలాల వద్ద లేక
స్పెన్సర్ సమీపంలోని డాన్బోస్కో పాఠశాల వద్ద ఏర్పాటు చేయాలన్న అంశంపై
చర్చించుకున్నారు.
ఈ విషయాలన్నీ బుధవారం ఉదయానికి ఖరారయ్యే సూచలు వున్నాయి. కార్య క్రమంలో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమా రి, దేశం నేతలు కొల్లి లక్ష్మయ్యచౌదరి, సం కా బాలాజీగుప్తా, అంకవరప్రసాద్, నందం అబద్దయ్య, తాడేపల్లి నేతలు మేకా పుల్లా రెడ్డి, కొర్రపాటి రమణ, కొల నుకొండ ఏష య్య, ఢిల్లీ రామారావు, బెజ్జం రామకృష్ణ, సురేష్, రవి, రమేష్ పాల్గొన్నారు.
బ్యారేజీ వద్దకు పుల్లారావు, మోదుగుల సోమవారం రాత్రి దేశం నేతలు ప్రత్తి పాటి పుల్లారావు, మోదుగుల వేణు గోపా లరెడ్డి, పుష్పరాజ్, కొమ్మాలపాటి శ్రీధర్, యరపతినేని శ్రీనివాసరావు తదితర నేతలు ప్రకాశం బ్యారేజీ వద్దకు విచ్చే శారు.
చంద్రబాబు పాదయాత్ర ప్రాంతా న్ని పరిశీలించి సీతానగరంలో బస చేసే కంటే విజయవాడ నుంచి 6వ తేదీ ఉద యం పాదయాత్రకు వచ్చి గుంటూరు జిల్లాలో అడుగు పెడితే బాగుంటుందని నేతలు చర్చించుకున్నారు. దాదాపుగా ఇదే విధంగా చంద్రబాబు పర్యటన ఖరా రు కావొచ్చని నేతలు భావిస్తున్నారు.
Posted by
arjun
at
5:30 AM