January 18, 2013
చంద్రబాబు పాదయాత్రతో పార్టీకి పూర్వవైభవం
అధినేత చంద్రబాబు పాదయాత్రతో జిల్లా పార్టీకి పూర్వ వైభవం చేకూరుతుందని
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్ తెలిపారు. బుధవారం ఆయన
'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు. వివిధ రకాల ఇబ్బందులతో అల్లాడిపోతున్న జనంతో
మమేకమై వారికి భరోసా కల్పించే దిశగా చంద్రబాబు పాదయాత్ర
కొనసాగుతుందన్నారు. బాబు రాకకోసం జిల్లా రైతులు, వివిధ వర్గాల ప్రజలు
ఆసక్తితో ఎదురుచూస్తున్నారని తెలిపారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు
మొదటి రోజు అన్ని మండలాల అధ్యక్షులు అధినాయకుడికి స్వాగతం పలుకుతారని
చెప్పారు.
ప్రతిరోజు కొన్ని నియోజకవర్గాల ముఖ్య నాయకులు బాబు పాదయాత్రలో పాలు పంచుకుంటారని తెలిపారు. సుమారు 50.5 కి.మీ. మేర నాలుగు రోజులపాటు జిల్లాలో బాబు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఇందుకోసం స్వాగతం మొదలు సభలు, ఆవిష్కరణలు, వీడ్కోలు వరకు ప్రణాళికాబద్ధంగా జిల్లా నాయకత్వం ఏర్పాట్లు చేసిందని వివరించారు. పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవని, పాదయాత్ర విజయవంతానికి అంతా కృషి చేస్తున్నారని అన్నారు.
ప్రతిరోజు కొన్ని నియోజకవర్గాల ముఖ్య నాయకులు బాబు పాదయాత్రలో పాలు పంచుకుంటారని తెలిపారు. సుమారు 50.5 కి.మీ. మేర నాలుగు రోజులపాటు జిల్లాలో బాబు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఇందుకోసం స్వాగతం మొదలు సభలు, ఆవిష్కరణలు, వీడ్కోలు వరకు ప్రణాళికాబద్ధంగా జిల్లా నాయకత్వం ఏర్పాట్లు చేసిందని వివరించారు. పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవని, పాదయాత్ర విజయవంతానికి అంతా కృషి చేస్తున్నారని అన్నారు.
Posted by
arjun
at
12:55 AM