January 18, 2013

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా నిరంజన్‌రెడ్డి

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా మిర్యాలగూడకు చెందిన గార్లపాటి నిరంజన్‌రెడ్డి నియమితులయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు ఈ మేరకు ఫ్యాక్స్‌లో సమాచారం పంపారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నిరంజన్‌రెడ్డి ఆ పార్టీలో వివిధ హో దాల్లో పని చేస్తున్నారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చెరుకు అభివృద్ధి మండలి డైరెక్టర్‌గా నియమించారు. 1987లో సింగిల్‌విండో చైర్మన్‌గా ఎన్నికై డీసీసీబీ డైరెక్టర్‌గా పనిచేశారు. 1990నుంచి 1995 వరకు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 1995నుంచి 2000 వరకు మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్‌గా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొంది పని చేశారు.

2000 నుంచి 2004 వరకు తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేశారు. 2004 నుంచి 2008వరకు మిర్యాలగూడ, హుజూర్‌నగర్ ఉమ్మడి నియోజకవర్గ ఇన్‌చార్జిగా అదేకాలంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంపికైనప్పటికీ బీఫారం సకాలంలో అందక పోవడంతో ఎన్నికల నుంచి వైదొలిగారు.

తాజాగా ఆయన సేవలను గుర్తించిన చంద్రబాబు నిరంజన్‌రెడ్డిని రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమించారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాలో టీడీపీ అభివృద్ధికి తోడ్పడతానని, తన నియామకానికి కారకులైన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉమామాధవరెడ్డి, ఎమ్మె ల్యే వేనేపల్లి చందర్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు.

పలువురి హర్షంటీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా గార్లపాటి నిరంజన్‌రెడ్డిని నియమించడం పట్ల తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పెద్ది శ్రీనివాస్‌గౌడ్, పాతూరి ప్రసాద్, టీడీపీ నాయకులు తిరందాసు విష్ణు, మంగ్యానాయక్, విద్యాసాగర్, ప్రకాశ్, ఎండి. షఫీ, సాంబశివరావు, హతీరాం, రాములుగౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.