December 13, 2012
నిజాయితీగా, నిప్పులా బతికాను: బాబు
ఆదిలాబాద్, డిసెంబర్ 13 : సీఎంగా తాను నిజాయితీగా, నిప్పులా బతికాననీ,దాంతో
తనపై ఎన్ని ఎంక్వైరీలు వేసినా తనకు ఏమి కాలేదని టీడీపీ అధినేత
చంద్రబాబుఅన్నారు. పాదయాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మామడలో ఆయన
మాట్లాడారు. ఏటా తన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రజల ముందు పెడుతున్నాననీ, ఇతర
పార్టీల నేతలు కూడా ఆస్తులు ప్రకటిస్తే బాగుంటుందన్నారు.
వైఎస్ సీఎం కాగానే భూములను, గనులను అమ్ముకున్నాడనీ, జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చాడని ఆయన విమర్శించారు. లక్ష కోట్ల రూపాయలను దోచుకుని కొడుకుకు అప్పగించాడన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముందుగా తెలంగాణపై తన వైఖరి చెప్పాలనీ, తరువాత తమ వైఖరి చెప్తామనీ తెలిపారు.
వైఎస్ సీఎం కాగానే భూములను, గనులను అమ్ముకున్నాడనీ, జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చాడని ఆయన విమర్శించారు. లక్ష కోట్ల రూపాయలను దోచుకుని కొడుకుకు అప్పగించాడన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముందుగా తెలంగాణపై తన వైఖరి చెప్పాలనీ, తరువాత తమ వైఖరి చెప్తామనీ తెలిపారు.
Posted by
arjun
at
9:42 PM