June 9, 2013

ఏపీపీఎస్ సీలో దొంగలను సీఎం కాపాడుతున్నారు: పయ్యావుల

హైదరాబాద్: ఏపీపీఎస్ సీలోని దొంగలను సీఎం కిరణ్ కాపాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆదివారం హైదరాబాద్ లో ఆరోపించారు. ఏపీపీఎస్ సీ కార్యాలయం దొంగలు, బ్రోకర్లకు నిలయంగా మారిందని ఆయన అభివర్ణించారు. బోర్డు సభ్యులను వెంటనే తొలగించాలని కేశవ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏపీపీఎస్ సీని ప్రక్షాళన చేయాలంటూ ఆ పార్టీ నేతల నేతృత్వంలో కార్యకర్తల బృందం ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయానికి నిరసన ర్యాలీ చేపట్టింది. అయితే సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రవేశించేందుకు భద్రత సిబ్బంది వారికి అనుమతిని నిరాకరించారు. దాంతో సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.