June 9, 2013

అమరవీరుల కుటుంబాలను కేసీఆర్‌ పట్టించుకోలేదు:ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ అమరవీరుల కుటుంబాలను ఎప్పుడూ పట్టించుకోలేదని టీటీడీపీ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్‌చారీతో పాటు అనేక మందిని తన రాజకీయాల కోసం కేసీఆర్‌ వాడుకున్నారని ఆయన అన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాల గురించి కేసీఆర్‌ ఏనాడు దిగాలు పడలేదన్నారు. కేవలం తన స్వార్థ రాజకీయాలతో ముందుకు సాగుతున్నారని ఆయన చెప్పారు.