June 9, 2013

కేసీఆర్‌కు చిత్తశుద్ధిలేదు: ఎర్రబెల్లి


హైదరాబాద్: కేసీఆర్‌కు తెలంగాణపై చిత్తశుద్ధిలేదని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి కుటుంబాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణవాదాన్ని అడ్డుపెట్టుకుని అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్‌ అన్యాయం చేశారన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్త నాగరాజు మరణించినా కనీసం సానుభూతి కూడా ప్రకటించలేదని తెలిపారు. సొంత ప్రయోజనాల కోసం తెలంగాణవాదాన్ని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.