June 9, 2013

నేతలతో బాబు భేటీ

హైదరాబాద్‌ : సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశఋ౎ల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ముఖ్యనేతలతో ఆ పార్టీ చీఫ్‌ చంద్రబాబు భేటీ అయ్యారు. బయ్యారం గనులు తెలంగాణ ప్రాంతానికి దక్కాలని మంగళవారం అసెంబ్లీ వాయిదా తీర్మానం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. విద్యుత్‌ సంక్షోభానికి వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను అసెంబ్లీలో పెట్టాలని పార్టీ చీఫ్‌ బాబు నేతలకు సూచించారు. కళంకిత మంత్రులు, రైతు సమస్యలపై అసెంబ్లీలో గట్టిగా పోరాడాలని పార్టీ నేతలకు బాబు పిలుపునిచ్చారు.