June 21, 2013
కుక్కలు కాదు గుంటనక్కలు: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతలు తెలంగాణకు కాపలు కుక్కలు
కాదని, గుంట నక్కలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి
శుక్రవారం మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు
ఐఎంజి కేసులో క్లీన్ చిట్ వచ్చిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. బాబుకు ఈ
కేసులో క్లీన్ చిట్ వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి
నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే వారు
పదేపదే వారు తమ పార్టీ అధినేత పైన అనవసర ఆరోపణలు గుప్పిస్తూ ప్రజల్ని
నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ఉద్యమం ముసుగులో తెలంగాణ
ప్రజలను తెరాస నాయకులు దోచుకుంటున్నారని, విద్యార్థుల శవాల మీద పునాదులు
నిర్మించుకుంటున్నారని, భూవివాదంలో కెటిఆర్ భాగస్వామ్యం లేకపోతే
ప్రభుత్వానికి ఎందుకు సహకరించారని ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్
ఉంది కాబట్టే ప్రజలు వారిని భరిస్తున్నారని లేదంటే తరిమికొట్టేవారన్నారు.
తెరాస మీడియా సంస్థలో వ్యాపార ప్రకటనలు అన్నీ సీమాంధ్ర సంస్థలవే అన్నారు.
Posted by
arjun
at
3:55 AM