June 21, 2013

టిడిపి, టిఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ


తెలుగుదేశం, టిఆర్ఎస్ నేతల మధ్య ఆరోపణల పర్వం ప్రభావం జిల్లాలలో పార్టీ శ్రేణులపై కూడా పడుతోంది.టిఆర్ఎస్ నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుపై చేసిన విమర్శలకు నిరసనగా సిరిసిల్లలో టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో వీరికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఆందోళనకు దిగగా,ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తేవలసి వచ్చింది. పద్నాలుగుమంది టిఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.