June 21, 2013

ప్రజాసమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోతోంది : ధూళిపాళ్ల

సభలో చర్చకు సహకరిస్తామన్నా సభను సజావుగా జరుగకుండా చేస్తున్నారని, సభలో మంత్రులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ప్రజాసమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోతోందని యెద్దేవా చేశారు. జలయజ్ఞంలో లోపాలను కాగ్ బయటపెట్టిందని, కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన వైనాన్ని తప్పుబట్టిందని మరో నేత దేవినేని ఉమా అన్నారు. జలయజ్ఞంపై సీఎం కిరణ్, వైఎస్ అవినీతిపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో ఎవరి కాళ్లు ఎవరు పట్టుకుంటారో అని, తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ బుద్ది చెబుతుందని దేవినేని ఉమా వెల్లడించారు