June 20, 2013

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దొంగల్లా కూర్చున్నారు:మోత్కుపల్లి


తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు దొంగల్లా శాసనసభలో కూర్చున్నారని తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు విమర్శించారు. టిఆర్ఎస్ సభ్యులు అనూహ్యంగా సభలో ప్రశాంతంగా కూర్చోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మాచ్ ఫిక్సింగ్ బట్టబయలైందని అన్నారు. కెటిఆర్ దందాలను పక్కదారి పట్టించేందుకే శాసనసభలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణవాదాన్ని పక్కనబెట్టారని ఆయన అన్నారు.కెసిఆర్ కుటుంబం నిజాంను తలపిస్తోందని ఆయన అన్నారు.