June 19, 2013

అన్ని ఆధారాలతోనే కథనాలు ప్రసారం : ఏబీఎన్

మేం ప్రసారం చేసిన కథనానికి కట్టుబడి ఉన్నామని, అన్ని ఆధారాలతోనే ప్రసారం చేశామని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేర్కొంది. టీఆర్ఎస్ శాసనసభ్యుడు కె. తారక రామారావు చేసిన సవాల్‌పై ఏబీఎన్ స్పందించింది. కేటీఆర్ రేపు (గురువారం) సాయంత్రం వరకు ఆగాల్సిన అవసరం లేదని, ఈరోజే (బుధవారం) పరువు నష్టం దావా వేసుకోవచ్చునని, భయపడేది ఏమీ లేదని దమ్మున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్పష్టం చేసింది.