June 19, 2013

వైఎస్సార్‌పీసీ కాంగ్రెస్‌ కుమ్మక్కు


\\ టీడీపీ అధినేతపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరోపణలు అసమంజసమని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఆ పార్టీ శాసనసభ్యులు డి.నరేంద్ర చౌదరి, సండ్ర వెంకటవీరయ్యలు బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ వై.ఎస్‌. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చంద్ర బాబును లక్ష్యంగా ఎంచుకుని కేసులుబనాయింప జేశారని, ిసీబీఐని ఉసిగొలిపారని అన్నారు. ఐఎంజి భూములకు సంబంధించి వై.ఎస్‌.విజయమ్మ వేసిన పిటిషన్‌ ను కూడా కొట్టివేయడం జరిగిందన్నారు. వై.ఎస్‌ ప్రభుత్వం బాబు కేటాయిం చిన కొన్ని భూములను స్శాధీనం చేసుకోవడం కూడా జరిగిందని, మరికొన్ని కో ర్టు వివాదాలలో వున్నాయన్నారు. తమ నేతపై కక్షసాధింపు చర్యలకు పాల్పడి విజయం సాధించలేక పోయారని, అలాంటిది తాజాగా వైఎస్సార్‌సిిపి నాయ కులు తమ నేతపై నిందలు మోపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్‌ సిపి, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని,, ఆ రెండు పార్టీలను కలిపేం దుకే రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా దిగ్విజయ్‌సింగ్‌ వస్తున్నారని అన్నారు. తమ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షమేనని టీడీపీ నేతలు పేర్కొన్నారు.