June 20, 2013

నాడు సీమ రౌడీలు నేడు టిఆర్‌ఎస్ దోచుకున్నారు

రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ రౌడీలు భూ దందాలు చేస్తూ సెటిల్‌మెంట్ల పేరుతో దోచుకున్నారని, ఇప్పుడు టిఆర్‌ఎస్ నాయకులు అదే విధంగా దోచుకుంటున్నారని టిడిపి ఎమ్మెల్యేలు ఆరోపించారు. గన్‌పార్క్‌వద్ద గురువారం టిడిపి ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కెసిఆర్‌కు తెలంగాణ ఏర్పడాలని లేదని, తెలంగాణ వాదం పేరుతో డబ్బులు సంపాదించాలని ఉందని విమర్శించారు. చివరకు ఒక భవనం నిర్మించుకోవాలన్నా కెసిఆర్‌కు డబ్బు చెల్లించాలనే డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. టిఆర్‌ఎస్ రాజకీయాల్లో కొత్త సంప్రదాయం మొదలు పెట్టిందని అన్నారు. సినిమా వారిని, పరిశ్రమల వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. (చిత్రం) గురువారం గన్‌పార్క్ వద్ద ధర్నా చేస్తున్న టిడిపి ఎమ్మెల్యేలు