May 10, 2013

గుంటూరులో టీడీపీ కార్యకర్త దారుణహత్య

గుంటూరు : జిల్లాలోని రెంటచింతల మండలం మంచికల్లులో టీడీపీ కార్యకర్త సుబ్రహ్మణ్యం దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తుతెలియని దుండగులు సుబ్రహ్మణ్యాన్ని కత్తులతో పొడిచి చంపారు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ బంధువు సుబ్రహ్మణ్యం. మృతుడు దుర్గి మండలం ధర్మవరంకు చెందిన వ్యక్తి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.