May 10, 2013

నేను చెబితే వింటుందా? ప్రధానినే దులిపేస్తున్నారు..అలాంటిది నేను సుప్రీంను ప్రభవితం చేయడమా?

ఢిల్లీలో వైద్యం చేయించుకొని వచ్చా : చంద్రబాబు

హైదరాబాద్

తొమ్మిదేళ్ల నుంచి తాను ప్రతిపక్షంలో ఉన్నానని చెప్పారు. " పైగా మాది రాష్ట్ర స్థాయి పార్టీ. మేం సుప్రీం కోర్టును ఎలా ప్రభావితం చేయగలుగుతాం? సుప్రీం కోర్టు నిన్నే ప్రధాని, న్యాయ శాఖ బొగ్గు శాఖల మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేసి దులిపేసింది. అంతటి స్థాయి వారిని కూడా లక్ష్య పెట్టని కోర్టును మేం ప్రభావితం చేయడం సాధ్యమేనా? తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాపై పడితే ఎలా? వారికి అనుకూలంగా లేకపోతే న్యాయమూర్తులు సహా ప్రతివారిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. దేశంలో ఏ వ్యక్తి ఇలా కోర్టులను, న్యాయమూర్తులను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేయలేదు.

నాంపల్లి కోర్టు నుంచి న్యూ ఢిల్లీ కోర్టు వరకూ ఎందరో న్యాయమూర్తులు ఉంటారు. వారంతా జగన్‌కు విరోధులేనా? పత్రికలు, పార్టీలు, కోర్టులు ప్రతివారినీ బెదిరిస్తున్నారు. చివరకు ఫేస్‌బుక్‌లో ఎవరైనా ఏదైనా రాస్తే వారికి కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఎల్లకాలం ఇవి సాగవని గుర్తుంచుకోవాలి' అని హెచ్చరించారు. వారి ఆరోపణలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంపై ఆలోచిస్తామని చెప్పారు. వైసీపీ అడ్రస్ కూడా ఉండదని, చివరకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కూడా అనుమానమేనన్నారు. దేశంలో కోర్టుల వల్లే ఎంతో కొంత న్యాయం బతుకుతోందని వ్యాఖ్యానించారు.

"కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో మైనింగ్ మాఫియా విశ్వరూపంపై మేం ఆరేళ్ల కిందట ఒక పుస్తకం వేసి కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ప్రధాని ఆ విషయాన్ని గాలికి వదిలేశారు. అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే కోల్‌గేట్, కామన్‌వెల్త్ గేట్ జరిగేవి కావు. దేశంలో ప్రతి కుంభకోణంపైనా కోర్టులు పట్టించుకొనేవరకూ ప్రభుత్వం తనకుతానుగా తీసుకొన్న చర్యే లేదు. కోర్టుల వల్లే అవినీతిపరుల్లో కొంతైనా భయం నెలకొంది'' అని పేర్కొన్నారు. కళంకిత మంత్రులను చంకలో పెట్టుకొని కర్ణాటక ఫలితాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చంకలు కొట్టుకొంటే లాభం లేదని ఎద్దేవా చేశారు.

దేశం ఎటుపోతోందోనని ప్రధాని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారని, దేశాన్ని ఎటు తీసుకువెళ్తున్నారో...ఎటువంటి దిశా నిర్దేశం చేస్తున్నారో ముందు చెప్పాలన్నారు. పార్లమెంటులో మైనింగ్ మాఫియాపై చర్చ జరపాలని చూస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండూ కుమ్మక్కై రానివ్వలేదని విమర్శించారు. తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు పథకాలు ప్రకటిస్తే ఉపయోగం ఏమిటని కిరణ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. "రాజీవ్ యువ కిరణాలు పెట్టి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? కరెంటు కోతలు ఎత్తివేయగలిగారా? మేం చెప్పామని బెల్టు షాపులు తీసేస్తామంటున్నారు. ఆడపిల్లల పేరు మీద డిపాజిట్లు వేస్తామని చెబుతున్నారు. కనీసం మంత్రివర్గంలో చర్చించని ఈ ప«థకాలకు ఉన్న పవిత్రత ఏమిటి' అని ఆయన ప్రశ్నించారు.
: సాక్షాత్తూ దేశ ప్రధాన మంత్రినే దులిపేస్తున్న సుప్రీం కోర్టును తాను ప్రభావితం చేయడం సాధ్యమేనా అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీలో ఉండి జగన్‌కు బెయిల్ రాకుండా చేశారని వైసీపీ పార్టీ నేతలు చేసిన ఆరోపణపై విస్మయం వ్యక్తం చేశారు. గురువారమిక్కడ ఈ అంశాన్ని మీడియా ప్రస్తావించగా ఆయన తీవ్రంగా స్పందించారు. "ప్రజలను మభ్యపెట్టడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లాను. అక్కడ వర్ధన్ ఆస్పత్రిలో ఫిజియో థెరపీ చేయించుకొని వచ్చాను. దానికే ఇన్ని కల్పిస్తారా?'' అని మండిపడ్డారు.