May 10, 2013

కుటుంబ సమేతంగా తిరుమలకు బాబు

తిరుపతి

ఎమ్మెల్యేలు ముద్దుకృష్ణమనాయుడు, హేమలత, మాజీ ఎమ్మెల్యేలు చదలవాడ కృష్ణమూర్తి, లలితకుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయంలో చంద్రబాబుకు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. శనివారం ఉదయం ప్రారంభ సమయంలో చంద్రబాబు దంపతులతో పాటు నారా లోకేష్, భద్రతా సిబ్బంది దాదాపు 10 మంది స్వామివారిని దర్శించుకోనున్నారు.
: సుదీర్ఘ పాదయాత్ర అనంతరం శ్రీవారి దర్శనంకోసం తొలిసారిగా సొంత జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. రేణిగుంట విమానాశ్రయంనుంచి వందలాది వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడళ్ల వద్ద మహిళలు చంద్రబాబుకు దిష్టితీసి స్వాగతం పలికారు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు ప్రత్యేక విమానంలో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.