May 10, 2013
ప్రజాదరణతోనే అధికారంలోకి తెలుగుదేశం: పుత్తా
మా అప్పులు తీరుతాయంటే మీకే ఓటు వేస్తామంటూ చెబుతున్నారు. పల్లెపల్లెకు పుత్తా కార్యక్రమంలో చంద్రబాబు చెప్పిన హామీలపై మండలం లో మంచి స్పందన కనిపిస్తోంది. గురువారం దౌలతాపు రం, ఎస్టీ రామాపురంకాలని, కనుపర్తి, బలసింగాయపల్లె, కైలాసగిరికోన, కొండపేట గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమా ల్లో మండల తెలుగుదేశం పార్టీలు హామీలు వివరిస్తూ కరపత్రాలు పంచారు. దేశం పార్టీ అధికారంలోకి వస్తే రుణ మాఫిపై తొలి సంతకం చేసి బ్యాంకుల్లో అప్పులను తీరు స్తామన్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలు, గృహోపక రణాలకు 24 గంటలు కరెంట్ సరఫరా వుంటుందన్నారు. మైనారిటీ మహిళలు కోసం ఇవ్వబోతున్న పథకాలను ఆ పార్టీ కడప నగరనేత సుభాన్బాష వివరించడం జరిగింది.
తెలుగుదేశం హయాంలోనే ముస్లీంల అభివృద్ధి పెరిగింద న్నారు. కొండపేటలో దేశం నేత వెంట స్థానిక ప్రజలు అత్యధిక సంఖ్యలో గ్రామమంతా తిరిగారు. కార్యక్రమం లో దేశం నేతలు విజయభాస్క ర్రెడ్డి, శివారెడ్డి, కొండపేట సుధాకర్రెడ్డి, ప్రసాద్, ముండ్లపల్లె రాజ, ఖాసీంపీరా, ము క్తియార్, మన్నూరు రాజగోపాలుడు, కటారి వీరన్న, చలప తి, కమలాపురం నేతలు పాల్గొన్నారు.
Posted by
arjun
at
7:08 AM