April 18, 2013

సీఎం పర్యటనతో ఒరిగిందేమీ లేదు

టెక్కలిటౌన్ : జిల్లాలో ముఖ్యమం త్రి పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదని, సీ ఎం సభ విజయవంతం చేయడానికి ఐ దుగుర్ని బలితీసుకున్నారని టీడీపీ పా ర్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కింజ రాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. బుధవారం స్థానిక దేశం పార్టీ కార్యా లయంలో విలేఖరులతో మాట్లా డారు. రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమి తమవుతుందని ఆరోపించారు. వంశధా ర నిర్వాసితులకు పునరావాసం కల్పిం చడంలో ఈ ప్రభుత్వం విఫలమైంద న్నారు. ఆఫ్‌షోర్ గురించి మంగళవా రం జరిగిన సభలో ముఖ్యమంత్రి కిర ణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడకపోవడం విచా కరమన్నారు.

టెక్కలి ప్రజల దాహార్తిని తీర్చేందుకు పురుషోత్తమ సాగరంలో ఏడాది కిందట శంకుస్థాపన చేశారని, అయినా నేటికీ ఆ పనులు ఇసుమం తైనా జరగకపోవడం చూస్తుంటే ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధి ఏమిటో తెలు స్తుందన్నారు. సీఎం సభకు వచ్చి తిరిగి వెళ్తూ అయోధ్యపురం జంక్షన్‌లో జాతీ యరహదారిపై ట్రాక్టర్ బోల్తాపడి మృ తి చెందిన నందిగాం మండలం నౌగాం పంచాయతీ హుకుంపేట కుటుంబీకు లకు ఒక్కొ క్కరికి రూ.20లక్షల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలంతో పాటు ఎకరా భూమి ఇవ్వా లని ఆయన డిమాండ్ చేశారు.

దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయ ణ మూర్తి (బాబ్జీ) మాట్లాడుతూ అమ్మ హస్తం ప్రారంభ సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు రూ.185కే తొమ్మి ది వస్తువులు ఇస్తున్నామని, దీంతో పే దవాడు కడుపునిండా భోజనం చేస్తాడ ని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నా రు. వారి ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తులకు అడిగితే అవి ఎన్నాళ్లు వస్తాయో తెలు స్తుందని ఎద్దేవా చేశారు.ఈనెల 27తో టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు పాదయాత్ర విశాఖ లో ముగిస్తుందన్నారు. ఈనెల 21న శ్రీకాకుళంలో గల ఎన్‌జీవో భవనంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై విశాఖలో బాబు పాదయాత్ర సభకు హాజరయ్యేందుకు తీసుకోవాల్సిన చర్య లపై చర్చిస్తామని ఆయన అన్నారు.

అ నంతరం హరిశ్చంద్రపురం మాజీ ఎమ్మె ల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మా ట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అందరి వ్యక్తి అని, అటువంటిది ఆ య న్ని కలిసి వినతిపత్రం అందజేయ డా నికి తమకు హక్కులేదా అని ఆయన ప్రశ్నించారు. గృహనిర్భందం చేసి పో లీసులు అత్యుత్సాహం ప్రదర్శించార న్నారు. హుకుంపేట గ్రామ ఫీల్డ్అసి స్టెంట్, నందిగాం ఉపాధి ఏపీవోపై కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో తీవ్ర పోరాటం చేస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీ డీపీ నాయకులు ఎల్ఎల్ నాయుడు, హనుమంతు రామకృష్ణ, బగాది శేషగి రి, వెలమల విజయలక్ష్మి, పినకాన అజ య్‌కుమార్, పొన్నాడ వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.