April 18, 2013

మంత్రి ధర్మానను అడ్డుకునేందుకు టీడీపీ యత్నం

ప.గో : జిల్లాలో పలు అభివృధ్ది పనులను ప్రారంభించడానికి భీమవరం వచ్చిన మంత్రి ప్రసాద్‌రావు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. అవినీతి మంత్రి రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. న ర్సాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు వారి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో మంత్రి కాన్వాయ్ అక్కడి నుంచి కదిలింది. మరోవైపు ఎన్టీఆర్ విగ్రహం వద్ద మంత్రి ధర్మాన శంకుస్థాప చేయడంతో అపవిత్రమైందని విగ్రహానికి టీడీపీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.