April 18, 2013
పట్నం జనసంద్రం
సభ ముగిసేసరికి రాత్రి 8.30 గంటలు అయినప్పటికీ ప్రజలు పట్టణం దాటేవరకు చంద్రబాబు వెంట నడిచారు. ఆయా సభల్లో వైఎస్ కుటుంబ అవినీతి, రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాల గురించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా స్థానిక సమస్యలను కూడా ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రజలను ఆకట్టుకున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా బుధవారం చంద్రబాబు తన నడకవేగాన్ని కొంత పెంచడమే కాకుండా ఉదయం నుంచి కాస్త హుషారుగా ఉండడం టీడీపీ శ్రేణులకు ఊరటనిచ్చింది.
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన తనయుడు విజయ్బాబు, అయ్యన్న సోదరుడు, మాజీ సర్పంచ్ సన్యాసిపాత్రుడు, నియోజకవర్గ పరిధిలోగల నాలుగు మండలాల టీడీపీ నాయకులు,కార్యకర్తలు ప్రణాళికాబద్ధంగా కృషిచేయడంతో జిల్లాలో ఇంతవరకు ఎక్కడాలేనివిధంగా నియోజకవర్గ కేంద్రమైన నర్సీపట్నంలో చంద్రబాబు పాదయాత్ర కార్యక్రమం విజయవంతమైంది.
Posted by
arjun
at
7:10 AM