April 18, 2013
21న టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
ఆదిలాబాద్:
తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి జిల్లా సమావేశం ఈ నెల 21న ఉట్నూర్లో
జరుగనుంది. ఇదే రోజు ఇటీవల పార్టీ అధిష్ఠానం ప్రకటించిన జిల్లా కార్యవర్గ
ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు
వెల్లడించాయి. ఈ సమావేశంలో ఎంపీ రా«థోడ్ రమేశ్, జిల్లా అధ్యక్షుడు, బోథ్
నియోజకవర్గ ఎమ్మెల్యే గెడెం నగేశ్లతోపాటు పార్టీ సీనియర్ నాయకులు
పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు చేపట్టిన
పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి పాల్గొనేందుకుగాను టీడీపీ జిల్లా శ్రేణులు
సమాయత్తపరచనున్నారు. ఈ నెల 27 విశాఖ పట్టణంలో చంద్రబాబునాయుడు పాదయాత్ర
ముగుస్తున్నందున అక్కడ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సభకు ఆదిలాబాద్ జిల్లా నుంచి దాదాపు ఐదువేల మంది నాయకులను,కార్యకర్తలను తరలించాలని ఆపార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ రా«థోడ్ రమేశ్ బుధవారం ఆదిలాబాద్లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రతీ మండలానికి ఒక బాధ్యుడిని నియమించాలని నిర్ణయించారు. ప్రతీ మండలానికి కార్యకర్తలను తరలించేందుకు ఒక ఆర్టీసి బస్ను కేటాయించాలన్నారు.
ఎంపీతో జరిగిన సమావే శంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాయల శంకర్, టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలిరావుజాదవ్, జిల్లా అధికార ప్రతినిధి రవిందర్గౌడ్, జిల్లా కార్యదర్శి చిన్నస్వామి, బీసీ సెల్ జిల్లా నాయకుడు సి శంకర్, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు రమాదేవి, మాజీ జడ్పీటీసీ సభ్యులు రామునాయక్, రేఖానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
7:40 AM