March 23, 2013

'టీడీపీ పాలనతోనే ప్రజల కష్టాలు దూరం'

వర్ని: తెలుగుదేశం పాలనతోనే రాష్ట్రంలో ప్రజల కష్టాలు తీరుతాయని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బద్యానాయక్ స్పష్టం చేశారు. వర్ని మండలం రుద్రూర్ గ్రామంలో శుక్రవారం పాదయాత్ర, పార్టీ జెండావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చేతకాని కాంగ్రెస్ పాలనతో రాష్ట్ర ప్రజ లు విద్యుత్‌కోతతో అంధకారంను చవిచూస్తున్నారని ఆయన విమర్శించారు.

అభివృద్ధి పేరిట కాంగ్రెస్ పాలకులు దోపడికి పాల్పడుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని చోటా లీడ రు పేరుతో కిందిస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు కాంట్రాక్టర్లుగా చలామణి అవుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బద్యానాయక్ పాదయాత్రకు గ్రామంలో విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో నాయకులు కిషన్‌లాల్, వి.విఠల్, పెనుమరి శ్రీహరి, బైండ బాల్‌రాజ్, సాయినాథ్, ఇందూరి ఈశ్వర్, త్రిశాల్ గంగాధర్ పాల్గొన్నారు.