March 23, 2013

ప్రజాసమస్యలపై పోరాడేది తెదేపా ఒక్కటే

చెన్నూరు: ప్రజాసమస్యలపై నిత్యం పోరాడుతూ వాటి పరిష్కారం కోసం తెగువ చూపించేది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని ఆ పార్టీ కమలాపురం ని యోజకవర్గ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి అన్నారు. మండలంలోని కొండపే ట గ్రామంలో గురువారం అధిక సం ఖ్యలో మైనార్టీ నేతలు, యువకులు పు త్తా సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజల్లో వుండే వారికే ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు.

పార్టీలు మారేవారిని, ప ర్సేంటేజీల కోసం పనులు అమ్ముకునే వారిని దగ్గరకు రానివ్వొద్దన్నారు. తా ను నియోజకవర్గంలో తాగునీరు, సా గునీరు కోసం పాదయాత్ర చేస్తే ప్రజ లు తనతో కలసి రావడం మర్చిపోలేనిదన్నారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు నేటికి 170 రోజుల్లో 2500 కీ.మీ. పూర్తిచేశారన్నా రు. జరగబోవు ఎన్నికల్లో ప్రతి కార్యకర్త దేశం అభ్యర్థులను గెలిపించాలన్నారు.

దేశంకు కొండపేట కంచుకోట: దేశం పా ర్టీకి కొండపేట కంచుకోటని, గత ఎన్నికల్లో గ్రామంలో మెజార్టీ వచ్చిందని పుత్తా అన్నారు. పార్టీ బీసీ సెల్ జిల్లా ఉ పాధ్యక్షుడు అక్బర్ మాట్లాడుతూ ని యోజకవర్గంలో నిజమైన నీతివంతమైన నేత ఒక్క నరసింహారెడ్డినేనని అన్నారు

పుత్తాకు ఘనస్వాగతం: కొండపేటకు వచ్చిన పుత్తాకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. అనంతరం పలు సమస్యలు పు త్తా దృష్ఠికి తీసుకుపోగా సంబంధిత అ ధికారులతో మాట్లాడుతానని అన్నారు

దేశంలోచేరిక: పుత్తాసమక్షంలో గ్రామ నేతలు మాబు సహె బ్, గూడుబాషా, ఉసేన్ పీరా, రసూల్ ఖాజా రసూల్, పెద్దసుబ్బరాయుడు, దస్తగిరి, సుబా న్, సుబ్బరాయుడు, ఖాదర్ బాషా, ఖాసీంపీరా, ఖలీల్, టి.పి.ప్రసాద్, అశోక్‌రెడ్డితో పా టు స్థానికులు పెద్ద సంఖ్యలో తెదేపాలో చేరారు. కార్యక్ర మంలో దేశం నేతలు విజయభాస్కర్‌రెడ్డి, శివారెడ్డి, ఎ.వి.బాస్కర్, షబ్బీర్, గౌస్ పీర్, పాలకొండయ్య, చలపతి, సుధాకర్ రెడ్డి, రాంమ్‌ప్రసాద్, సుబ్బారెడ్డిలతో పాటు చెన్నూరు, కొం డపేట, శివాల్‌పల్లె, కొక్కిరాయపల్లె, బలిసింగాయపల్లి, కనపర్తి దేశం నేతలు పాల్గొన్నారు.