March 23, 2013

తుని టీడీపీ అభ్యర్థిగా దివ్య పోటీ

కాకినాడ: టీడీపీ సీనియర్ నాయకు డు యనమల రా మకృష్ణుడు కు మార్తె దివ్య 20 14అసెంబ్లీ ఎన్నికలలో తుని నుంచి పోటీచేయడానికి సిద్దమవుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. యనమలను టీడీపీ శాసనమండలికి పంపడంతో తుని నుంచి టీడీపీ తరపున ఎవరు పోటీచేస్తారు? అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో దివ్య పేరు తెరపైకి వస్తోంది. యనమల పెద్దకుమార్తె దివ్య ఇప్పటికే తండ్రి నుంచి రాజకీయంగా మెళకువలు నేర్చుకుంటున్నారు. యనమల వారసురాలిగా వచ్చే ఎన్నికలలో తు ని నుంచి పోటీచేసి గెలిచి అసెంబ్లీకి పం పాలని ఇప్పటికే యనమలపై ఆ పార్టీ నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. యనమల కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

వస్తున్నా మీ కోసం పాదయాత్ర తుని నియోజకవర్గానికి చేరినపుడు దివ్య చంద్రబాబును కలిసి తన మనసులో మాట వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే తుని అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో కీలక నాయకులు దివ్యఅభ్యర్ధిత్వంపై చర్చించుకుంటున్నారు. దివ్యకు సీటిస్తే యువత, మహిళ, బీసీ.. ఈ మూడు కోటాలలో ఇచ్చినట్లవుతుందన్న వాద న కూడా వినిపిస్తోంది.