March 6, 2013

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

టీడీపీ పూర్వ వైభవం తీసుకురావాలని... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు ఇప్ప రవి కోరారు. బుధవారం శివాలయంలో టీడీపీ మండల ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నారాయణ, లచ్చన్న, రాజలింగు, వినోద్‌రావు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి విజయానికి కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో శ్రీనివాస్, పాపయ్య, రాజు, పోశం, వెంకటి, వెంకటి, శ్రీనివాస్, మోహన్, రమేష్, గోపాల్ పాల్గొన్నారు.

తిర్యాణిలో...

మండలంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరు కృషి చేయాలని టీడీపీ అధ్యక్షుడు ముత్యం రాజయ్య కార్యకర్తలను కోరారు.పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. బుధవారం మండలంలోని మంగి, మాణిక్యపూర్, రోంపెల్లి గ్రామపంచాయతీల్లో జెండా పండగలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. త్వరలో జరగనునన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలందరు సైనికుల్లా పనిచేసి పార్టీ సత్తాను చూపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు హనుమాండ్ల జగదీష్, శ్రీనివాస్‌గౌడ్, ఆయా గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.