October 23, 2012
'వస్తున్నా... మీ కోసం' లో ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిష్కరిం చేందుకు గ్రివెన్స్ సెల్
చంద్రబాబు పాదయాత్రలో ప్రజల నుంచి వస్తున్న
వినతులను పరిష్కరిం చేందుకు టీడీపీ కార్యాలయంలో గ్రివెన్స్ సెల్ను ఏర్పాటు
చేశామని ఆ పార్టీ నేత రావులపాటి సీతారాంరావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో
సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు
'వస్తున్నా... మీ కోసం' పాదయాత్రకు సంబంధించిన రెండో పాటల సీడీని ఆయన
ఆవిష్కరించారు. బాబు యాత్రకు మహబూబ్నగర్ జిల్లాలోనూ అపూర్వ స్పందన
లభిస్తోందన్నారు. బాబు యాత్రలో అందిన ప్రజా వినతుల్లో ఇప్పటి వరకు 300
వినతులను పరిష్కరించామని సీతారాంరావు తెలిపారు.
నేటి పాదయాత్ర షెడ్యూల్: చంద్రబాబు మీ కోసం పాదయాత్ర 22వ రోజు మంగళవారం మహబూబ్నగర్ జిల్లా శాంతినగర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ నుంచి ప్రారంభమవుతుంది. 26వ కాలువ, జోలపల్లు, కొంకల్క్రాక్, వెంకటాపురం స్టేజీ, ఐజ మండలం పడిగాపులం మీదుగా ఇప్పల క్రాస్ రోడ్ వరకు సాగుతుంది.
నేటి పాదయాత్ర షెడ్యూల్: చంద్రబాబు మీ కోసం పాదయాత్ర 22వ రోజు మంగళవారం మహబూబ్నగర్ జిల్లా శాంతినగర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ నుంచి ప్రారంభమవుతుంది. 26వ కాలువ, జోలపల్లు, కొంకల్క్రాక్, వెంకటాపురం స్టేజీ, ఐజ మండలం పడిగాపులం మీదుగా ఇప్పల క్రాస్ రోడ్ వరకు సాగుతుంది.
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment