October 23, 2012

మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రజల నుంచి మంచి స్పందన

ప్రజా స్పందన బాగుంది 'ఆంధ్రజ్యోతి'తో చంద్రబాబు

  మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రజల నుంచి మంచి స్పందన కనిపించిందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజోలి నుంచి పాదయాత్రగా వస్తున్న ఆయనను ఆంధ్రజ్యోతి పలకరించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా అనూహ్య స్పందన కనిపించిందని చెప్పారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యలను తెలుసుకునేందుకే పాదయాత్రగా వచ్చానని చెప్పారు. సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం మొండివైఖరిని అవలంభిస్తోందని మండిపడ్డారు.

వరదలు ముంచెత్తినప్పుడు మొట్టమొదట వచ్చింది తానేనని, మూడేళ్లు అయినా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శమని విమర్శించారు. ఆరున్నరకు రాజోలిలో బహిరంగ సభ ముగించుకుని రాజోలి గుడారాల మీదుగా రాత్రి 10 గంటలకు వడ్డెపల్లికి చేరుకున్నారు. 10.30కు శాంతినగర్ వచ్చారు. అప్పటికీ శాంతినగర్ చౌరస్తాలో ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తూ కన్పించారు. పాదయాత్రలో అడుగడుగునా ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి ధైర్యం చెబుతూ ముందుకు నడిచారు.
No comments :

No comments :