October 23, 2012

కంటిపాపలా బాబు యాత్రను కాపాడుతాం: మంద కృష్ణ

 కెసీఆర్‌కు, పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్‌లకు తెలంగాణ ఏర్పాటు కంటే వారి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని, అందువల్లే వారు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రోడ్లు, రహదారుల బంగ్లాలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ సాధన కోసం ఢిల్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నామని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దలు గులాంనబీ అజాద్, వాయిలార్ రవి తెలంగాణపై చేసిన ప్రకటనలపై ఉద్యమించకుండా తెలంగాణ విషయంలో కట్టుబడిఉన్నానని చెబుతూ, చంద్రబాబు పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నించడం సమంజసం కాదన్నారు. ఈ పరిస్థితిని చూస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో జరిపిన చర్చలు బాబు పర్యటనను అడ్డుకోవడానికేనని భావిస్తున్నామన్నారు.
No comments :

No comments :