October 22, 2012

దేశ, విదేశాలు నా పాలనను అనుసరిస్తున్నాయి

దేశ, విదేశాలు నా పాలనను అనుసరిస్తున్నాయి
కాంగ్రెస్ దోపిడీ అపితే సమస్యలు తీరుతాయి

  తమ పాలనపై కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారని, తన పాలనను దేశ, విదేశాలు అనుసరించాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల దోపిడీని ఆపితే ఆ డబ్బుతో సమస్యలన్నీ తీరుతాయని ఆయన పేర్కొన్నారు.

'వస్తున్నా...మీకోసం' కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర 21వ రోజుకు చేరింది. సోమవారం ఉదయం జిల్లాలోని కోడూరు నియోజకవర్గం కొత్తకోట, పాలవాగవంచ నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే నూటికి నూరు శాతం రైతులకు వడ్డీ రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా పాదయాత్రలో ఉన్న చంద్రబాబును ఏపీయూడబ్లూజే ప్రతినిధులు కలుసుకుని యాత్రకు సంఘీభావం ప్రకటించారు. తమ సమస్యలు పరిష్కరణకు కృషి చేయాలంటూ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ఈరోజు మొత్తం 12 కి.మీ పాదయాత్రగా చంద్రబాబు వెళ్లనున్నారు మధ్నాహ్నానికి సుంకేశుల నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు చేరుకుని, రాజోలి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు. బాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీ.టీడీపీ ఫోరం నేతలు, అభిమానులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాదయాత్రలో నారా లోకేష్ పాల్గొననున్నట్లు సమాచారం.
No comments :

No comments :