June 7, 2013
తెలంగాణ రాష్ట్ర సమితి ధనవంతుల పార్టీ: మోత్కుపల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ధనవంతుల పార్టీ అని తెలుగుదేశం పార్టీ
సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం మండిపడ్డారు. పార్టీకి
చెందిన యువనేత నాగరాజు మృతి చెందితే ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల
చంద్రశేఖర రావు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కెసిఆర్ దగుల్బాజి,
మోసకారి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మవద్దన్నారు. కెసిఆర్ వల్ల తెలంగాణ
రాదన్నారు.
తెరాసను, కెసిఆర్ను నమ్ముకోవడం కంటే చావే గతి
అన్నారు. కెసిఆర్ ఓ బకాసురుడు అన్నారు. వలస వెళ్లిన నేతలను తెలంగాణవాదులు
నమ్మొద్దన్నారు. తెలంగాణ ప్రజలు ఛీ కొడతారనే కెసిఆర్ నాగరాజు మృతదేహాన్ని
చూసేందుకు కూడా వెళ్లలేదన్నారు. కెసిఆర్ రాజకీయాలకు ఓ అమాయక యువకుడు
బలయ్యారని మండిపడ్డారు.
Posted by
arjun
at
7:04 AM