June 7, 2013

తెలంగాణ రాష్ట్ర సమితి ధనవంతుల పార్టీ: మోత్కుపల్లి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ధనవంతుల పార్టీ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం మండిపడ్డారు. పార్టీకి చెందిన యువనేత నాగరాజు మృతి చెందితే ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కెసిఆర్ దగుల్బాజి, మోసకారి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మవద్దన్నారు. కెసిఆర్ వల్ల తెలంగాణ రాదన్నారు.

తెరాసను, కెసిఆర్‌ను నమ్ముకోవడం కంటే చావే గతి అన్నారు. కెసిఆర్ ఓ బకాసురుడు అన్నారు. వలస వెళ్లిన నేతలను తెలంగాణవాదులు నమ్మొద్దన్నారు. తెలంగాణ ప్రజలు ఛీ కొడతారనే కెసిఆర్ నాగరాజు మృతదేహాన్ని చూసేందుకు కూడా వెళ్లలేదన్నారు. కెసిఆర్ రాజకీయాలకు ఓ అమాయక యువకుడు బలయ్యారని మండిపడ్డారు.