June 10, 2013

బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించాలి : బాబు

హైదరాబాద్ : బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని టీడీపీ చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గిరిజనుల పొట్ట కొట్టేలా ఆనాడు సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. ఈ ధర్నాలో తెలంగాణ టీడీపీ నేతలతో పాటు సీమాంధ్ర నేతలు కూడా పాల్గొన్నారు.