June 10, 2013
బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించాలి : బాబు
హైదరాబాద్ : బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించాలని టీడీపీ
అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు
చేయాలని టీడీపీ చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో
మాట్లాడారు. గిరిజనుల పొట్ట కొట్టేలా ఆనాడు సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి
వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు
చేయాలని సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. ఈ ధర్నాలో తెలంగాణ
టీడీపీ నేతలతో పాటు సీమాంధ్ర నేతలు కూడా పాల్గొన్నారు.
Posted by
arjun
at
9:18 PM