June 10, 2013

గవర్నర్ ను కలిసిన చంద్రబాబు బృందం


హైదరాబాద్: ఏపీపీఎస్సీ కార్యవర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీలో ఉన్న ఐదుగురు సభ్యులు రాజీనామా చేయాలన్నారు. అర్హత లేని వ్యక్తులంతా ఇప్పుడు బోర్డు సభ్యులుగా ఉన్నారని, వీరి వల్ల నిరుద్యోగులు, యువతకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో గవర్నర్ నరసింహన్ ను చంద్రబాబు సహా టీడీపీ నేతలు కలిశారు. తమ అభ్యర్థనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని చంద్రబాబు చెప్పారు.