June 10, 2013
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తద్యం : డాక్టర్ ఎన్.శివప్రసాద్
(కె.ఎన్.ఎన్)నేటి అధికార కిరణ్ సర్కార్
సిగ్గులేని ప్రభుత్వమని, ప్రజాధనాన్ని దోచుకొని తినడమే పనిగా ప్రభుత్వం
నడుస్తోందని, మరోపక్క మంత్రులను భర్తరఫ్ చేస్తూ, ప్రజాసంక్షేమాన్ని
విస్మరిస్తున్నారని చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు
సభ్యులు డాక్టర్ ఎన్.శివప్రసాద్ ఆరోపించారు. ఆదివారం ఎస్.ఆర్.పురం
మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపి మాట్లాడుతూ నేటి అధికార
కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ప్రజాధనాన్ని దోచుకుతింటూ అమలుకు
సాధ్యంకాని ఉచిత హామీలను గుప్పిస్తున్నారని ఎంపి ఆరోపించారు. ప్రజలు నేడు
తెలివివంతులుగా వున్నారని, కాంగ్రెస్ ఆర్భాటాలకు లొంగరన్నారు. రానున్న
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని, ప్రజలు కూడా
టిడిపివైపే వున్నారని ఎంపి జోస్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ
ఎమ్మెల్యే ఆర్.గాంధీ, జిల్లా నాయకులు దొరబాబు, బాలాజీనాయుడు,
శ్రీధర్వర్మ, ఇందిర, మండల నాయకులు భాస్కర్నాయుడు, దేవసుందరం,
గోవర్ధన్రెడ్డి, జయశంకర్నాయుడులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
7:36 AM