May 8, 2013

టీడీపీపీ ఆఫీసులో బాలకృష్ణ.. సెంట్రల్ హాల్‌కు హరికృష్ణ


విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన బాలకృష్ణ తన సోదరి పురందేశ్వరి నివాసంలోనే బస చేశారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపూ ఆయన చంద్రబాబుతో ఉన్నారు. ఆయనతో పాటే టీడీపీపీ కార్యాలయానికి వెళ్లారు. తర్వాత మళ్లీ పురందేశ్వరి దంపతులు ఏర్పాటుచేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వెంటనే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. మరో కుమారుడు కళ్యాణ్‌రామ్, ఆయన భార్యను వెంట పెట్టుకుని హరికృష్ణ సెంట్రల్ హాల్‌కు వెళ్లారు.